Weather Report: భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈశాన్య రుతుపవనాలు వెనుదిరిగాయని భారత వాతావర శాఖ అధికారులు వెల్లడించారు. దీని వల్ల.. ఆయా ప్రాంతాల్లో వర్ష ప్రభావం తగ్గినట్లు తెలిపారు.
అంతేకాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని అధికారులు ప్రకటించారు. తూర్పుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, ఫలితంగా వాతావరణంలో చాలా మార్పలు వస్తాయని పేర్కొన్నారు. రానున్న రెండు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. అయితే, శివారు ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలున్న చోట చలి తీవ్రంగా అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు.
Also read:
EAMCET 2020: విద్యార్థులు బీ అలెర్ట్.. నేటి నుంచే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
ప్రత్యేక టెస్టింగ్ల్యాబ్ ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు మంత్రి కేటీఆర్ లేఖ