Andhra Pradesh: 30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..

|

Mar 28, 2024 | 4:25 PM

వివరాల్లోకి వెళితే.. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎంపీ స్థానాల్లో నరసాపురం స్థానం నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకు ఎంపీ సీటు దక్కడంపై శ్రీనివా వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ టికెట్ ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయంలో కమలం పువ్వు గుర్తుపై అమాంతం పడిపోయాడు...

Andhra Pradesh: 30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
Bhupathiraju srinivasa varma
Follow us on

భావోద్వేగానికి ఎవరూ అతీతులు కారు. జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎమోషన్‌ కావడం సర్వసాధారణం. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. తన 30 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటూ ఎన్నికల కార్యాలయంలో భావోద్వేగానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎంపీ స్థానాల్లో నరసాపురం స్థానం నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకు ఎంపీ సీటు దక్కడంపై శ్రీనివా వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ టికెట్ ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయంలో కమలం పువ్వు గుర్తుపై అమాంతం పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో..

ఇదిలా ఉంటే ఈ విషయమై మాట్లాడిన భూపతి రాజు 30 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని అన్నారు. తన జీవితం కమాలినకే అంకితం అంటూ ఎమోషనల్‌ అయ్యారు. కాగా నరసాపురం సీటు విషయంలో మొదటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. తనకు కచ్చితంగా సీటు వస్తుందని సిట్టింగ్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి అధిష్టానం భూపతి రాజుకు సీటు ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..