Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి కనిపించడం లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజలకు తానున్నానని హామీ ఇచ్చిన సీఎం జగన్.. ప్రస్తుతం కనిపించడం లేదని లోకేష్ విమర్శించారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాతో గర్భిణి మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వల్లనే ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాతో గర్భిణి, కడుపులో బిడ్డ కూడా మృతి చెందింది. ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ ఆయన ఆరోపించారు. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నా.. జగన్ తాడేపల్లి గడప దాటడం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, కడుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం @ysjagan వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు.(1/2) pic.twitter.com/xUsa08TGnW
— Lokesh Nara (@naralokesh) May 9, 2021