Insurance: గ్రామ వాలంటీర్లకు ప్రమాద బీమా.. సొంత డబ్బుతో ఇన్స్యూరెన్స్ చేయించిన ఎమ్మెల్యే..

|

Jan 22, 2022 | 7:27 PM

ఏపీలోనే తొలిసారిగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా...

Insurance: గ్రామ వాలంటీర్లకు ప్రమాద బీమా.. సొంత డబ్బుతో ఇన్స్యూరెన్స్ చేయించిన ఎమ్మెల్యే..
Insurance (1)
Follow us on

ఏపీలోనే తొలిసారిగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. సచివాలయాల పరిధిలోని 1,475 మంది వాలంటీర్లకు ప్రమాద భీమా సౌకర్యాన్ని తన సొంత ఖర్చుతో చేయించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతులు మీదుగా మూడేళ్ల ఇనూర్సెన్స్​కు సంబంధించిన భీమా బాండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కలెక్టర్ హరికిరణ్ అభినందించారు. గతంలో తాను కడప కలెక్టర్​గా పులివెందులలో అభివృద్ధిని చూశానని.. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గం అభివృద్ధిలో పులివెందులతో పోటీ పడుతోందని చెప్పారు.

Read Also..  AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ టెర్రర్