ఓట్ల తొలగింపుపై ఈసీకి మంత్రి అయ్యన్న ఫిర్యాదు

|

Mar 07, 2019 | 6:57 PM

విశాఖ: ఏపీ నేతల, కార్యకర్తల ఓట్లు తొలగించమని వైసీపీ వర్గానికి చెందినవారే దరఖాస్తు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఓట్ల తొలగింపు విషయంపై స్వయంగా ప్రతిపక్ష నేత పిర్యాదు చేసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఓట్ల తొలగింపు అంశంపై అయ్యన్నపాత్రుడు ఎన్నికల […]

ఓట్ల తొలగింపుపై ఈసీకి మంత్రి అయ్యన్న ఫిర్యాదు
Follow us on

విశాఖ: ఏపీ నేతల, కార్యకర్తల ఓట్లు తొలగించమని వైసీపీ వర్గానికి చెందినవారే దరఖాస్తు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఓట్ల తొలగింపు విషయంపై స్వయంగా ప్రతిపక్ష నేత పిర్యాదు చేసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఓట్ల తొలగింపు అంశంపై అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో 82 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, అదే తరహాలో ఏపీలో చేయడానికి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని, విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.