మ‌రో వివాదంలో మాన్సాన్ చైర్ ప‌ర్స‌న్‌ సంచ‌యిత గ‌ణ‌ప‌తి రాజు .. సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వివాదాలు

|

Dec 15, 2020 | 2:30 PM

మాన్సాన్ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత గ‌ణ‌ప‌తి రాజు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. సంచ‌యిత నిర్ణ‌యాలు రోజురోజుకు వివాద‌స్ప‌ద‌మ‌వుతున్నాయి. తాజాగా మ‌రో వివాదానికి తెర‌తీశారు. న‌గ‌రం...

మ‌రో వివాదంలో మాన్సాన్ చైర్ ప‌ర్స‌న్‌ సంచ‌యిత గ‌ణ‌ప‌తి రాజు .. సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వివాదాలు
Follow us on

విజ‌య‌న‌గ‌రం:  మాన్సాన్ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత గ‌ణ‌ప‌తి రాజు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. సంచ‌యిత నిర్ణ‌యాలు రోజురోజుకు వివాద‌స్ప‌ద‌మ‌వుతున్నాయి. తాజాగా మ‌రో వివాదానికి తెర‌తీశారు. న‌గ‌రంలో అయోధ్య మైదానానికి తాళాలు వేయ‌డం వివాదానికి దారి తీసింది. విద్యార్థులు, సిబ్బంది త‌ప్ప మిగిలిన వారు లోప‌లికి వెళ్ల‌కూడ‌ద‌ని మ‌హ‌రాజా కాలేజీ ప్రిన్సిపాల్ నోటీసులు జారీ చేశారు.

ఈ నిర్ణ‌యంపై స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఎన్నో ఏళ్లుగా క‌ళాశాల మైదానంలో న‌గ‌ర ప్ర‌జ‌లు వాకింగ్ చేస్తుండ‌గా, తాజాగా తాళాలు వేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మాన్సాన్ యాజ‌మాన్యం తీరుపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.