చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అయితే.. కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.