కుప్పంలో కలకలం..వైసీపీ నేత హత్యకు కుట్ర…

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:42 PM

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు వేసిన స్కెచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. మర్డర్‌కు  పక్కా స్కెచ్ వేసిన దుండగులు..  పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌తో రూ.10లక్షలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 

కుప్పంలో కలకలం..వైసీపీ నేత హత్యకు కుట్ర...
Follow us on

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు వేసిన స్కెచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. మర్డర్‌కు  పక్కా స్కెచ్ వేసిన దుండగులు..  పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌తో రూ.10లక్షలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.  అడ్వాన్స్‌గా అతడికి కొంత డబ్బు కూడా ముట్టజెప్పారు. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్..కుప్పం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ హత్యకు స్కెచ్ గీసిన కిలాడీల కోసం వారి దగ్గర నుంచి సమాచారం రాబడుతున్నారు. కుప్పం.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కావడంతో…ఈ అంశం కలకలంగా మారింది. కాగా విద్యాసాగర్ గత ఎన్నికలకు ముందు టీడీపీను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా పోయినసారి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిపోవడంలో విద్యాసాగర్ వైసీపీ తరుఫున కీలక భూమిక పోషించినట్టు తెలుస్తోంది.