గుంటూరు సత్తెనపల్లిలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై స్పందించారు ఎమ్మెల్యే కోడెల. తనకు వ్యతిరేకంగా సొంత టీడీపీ నేతలే ఆందోళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా టీడీపీ నేతలతో ఈ ఆందోళనలు చేపిస్తున్నారాని అన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారంతా తన వల్ల లబ్ధిపొందినవారేనని అన్నారు. అసలు సత్తెనపల్లిని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తనదేనని అన్నారు కోడెల.
నరసారావుపేట నుంచి పోటీ చేయమని తనను ఎవరూ అడగలేదని కోడెల స్పష్టం చేశారు. అయినా.. సత్తెనపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ టికెట్ను టీడీపీ నేత రాయపాటి ఎలా అడుగుతారని ప్రశ్నించారు.