ఓటమిపై జనసేనాని సమీక్ష

| Edited By:

Jun 06, 2019 | 8:47 PM

అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా అభ్యర్థులతో ఇవాళ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుతో పాటు.. పార్టీ ఓటమికి గల కారణాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరితో పాటు జనసేన పోరాట యాత్ర, ఎన్నికల ప్రచార సభలకు హాజరైన […]

ఓటమిపై జనసేనాని సమీక్ష
Follow us on

అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా అభ్యర్థులతో ఇవాళ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుతో పాటు.. పార్టీ ఓటమికి గల కారణాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరితో పాటు జనసేన పోరాట యాత్ర, ఎన్నికల ప్రచార సభలకు హాజరైన వారికీ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్ల వయసు గల తమ పార్టీకి ఇన్ని లక్షల మంది ఓటర్లు తమకు ఓటు వేశారంటే.. అది విజయంగానే భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.