Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నరసరాపురం(Narasapuram)లో జరిగే మీటింగ్ కు వెళ్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. ముందుగా రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మీదుగా ర్యాలీగా నరసాపురం వెళ్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో నిలుచుని ర్యాలీగా వెళ్తున్న సమయంలో దారిపొడవునా జనసంద్రంగా మారిపోయింది. రహదారి అభిమానులు, కార్యకర్తలు ప్రజలతో నిండిపోయింది. ఈ సమయంలో పవన్ తన కారుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ అభిమాని కారుపైకి ఎక్కి.. దూసుకుని వెళ్ళాడు.. పవన్ కళ్యాణ్ ను ఒక్కసారిగా లాగాడు. దీంతో నిల్చుని అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్ కారుపైనే పడిపోయారు. వెంటనే తేరుకుని పైకిలేచారు. ఈ ఘటనతో పవన్తో పాటు అభిమానులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు.
పవన్ ర్యాలీలో ఒక అమ్మాయి.. కారు పైకి ఎక్కి.. హారతి నిచ్చింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: