టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. శ్రీవారి భక్తులకు పండగే..

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2019 | 4:43 PM

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున.. భక్తులకు రెండు రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 2019-20 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్ రూ. 3243 కోట్లుగా ఆమోదించారు. ఇందులో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటుకు రూ. 3.4 కోట్లు, పరిపాలన భవనం రిపేరింగ్‌లకు రూ.14.5 కోట్లను కేటాయించారు. శ్రీవరహస్వామి ఆలయంలోని […]

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. శ్రీవారి భక్తులకు పండగే..
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున.. భక్తులకు రెండు రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 2019-20 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్ రూ. 3243 కోట్లుగా ఆమోదించారు. ఇందులో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటుకు రూ. 3.4 కోట్లు, పరిపాలన భవనం రిపేరింగ్‌లకు రూ.14.5 కోట్లను కేటాయించారు. శ్రీవరహస్వామి ఆలయంలోని గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు రూ. 14 కోట్లు, ఘాట్ రోడ్డు రిపేరింగ్‌ల కోసం రూ. 8 కోట్లు కేటాయించారు. అంతేకాదు.. సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది.

ఇక ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు రూ.30 కోట్లను కేటాయించారు. అ ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అంతేకాదు.. జమ్ముకశ్మీర్‌లో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు కూడా పాలక మండలి నిర్ణయించింది. రమణధీక్షితులును గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.