విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీ.జీ కోర్సులో చేరేందుకు గడువు పొడగించిన యూనివర్సిటీ..

|

Dec 19, 2020 | 12:03 AM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. డిగ్రీ, పీ.జీ కోర్సులో చేరేందుకు ప్రవేశ గడువు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీ.జీ కోర్సులో చేరేందుకు గడువు పొడగించిన యూనివర్సిటీ..
Follow us on

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. డిగ్రీ, పీ.జీ కోర్సులో చేరేందుకు ప్రవేశ గడువు డిసెంబర్ 31వరకు పొడగించినట్లు ఇంఛార్జి రిజిస్ట్రార్ డా. జీ.లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. బీ-టెక్, బీ ఫార్మసీ, కోర్సులు చదవిన విద్యార్థులు కూడా ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ, జర్నలిజం, కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది వివిధ కారణాలతో చదువలేక పోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాలను www.braouonline.in లో పొందుపరిచినట్లు వెల్లడించారు. కోర్సులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు 7382929570/580/590/600 040-23680333 / 555 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.