కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

| Edited By:

Jul 04, 2020 | 4:40 PM

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించారు.

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు
Follow us on

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

కాగా గత నెల 29న హత్యకు గురైన భాస్కరరావు కేసులో పోలీసులు తొలుత ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో కొల్లు రవీంద్ర అనుచరుడు కూడా ఉన్నాడు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామ్యం అయినట్లు తేలింది. దీంతో రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. విశాఖపట్టణం వెళుతుండగా.. మార్గమధ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు రవీంద్రను అరెస్ట్‌ చేశారు.