కుప్పం జగన్ సభలో అపశృతి..ఒకరి మృతి

|

Apr 05, 2019 | 4:00 PM

చిత్తూరు జిల్లా కుప్పంలో  వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరగడంతో బేట్రాయుడు స్పృహ కొల్పోవడంతో కార్యకర్తలు ఆయనను స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందిన ఘటన మరువక […]

కుప్పం జగన్ సభలో అపశృతి..ఒకరి మృతి
Follow us on

చిత్తూరు జిల్లా కుప్పంలో  వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరగడంతో బేట్రాయుడు స్పృహ కొల్పోవడంతో కార్యకర్తలు ఆయనను స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.