ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న జగన్ మాటలు నమ్మి వైసీపీలో చేరా.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదని రావెల కిశోర్బాబు ఆరోపించారు. ఏపీ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారు. ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు. నలభై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ సైతం కూటమికే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను వైసీపీని వీడుతున్నట్టు రావెల ప్రకటించారు. వర్గీకరణకు అనుకూలంగా పని చేసే పార్టీలో చేరతానంటున్నారు.
2014లో టీడీపీ తరపును గెలిచిన రావెల కిశోర్బాబు.. ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో టీడీపీని వీడి జనసేనలో చేరారు. ఆ తర్వాత ఏడాదిలోపే జనసేనను వీడి బీజేపీ గూటికి చేరారు. కొన్ని రోజులకు బీజేపీని కూడా వదిలేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీలో కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. చివరకు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో.. ఆ పార్టీని కూడా వీడుతున్నట్టు రావెల ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..