విశాఖలో తాగుబోతు వీరంగం.. కత్తితో పోలీసులపై దాడి!

| Edited By:

Nov 19, 2019 | 4:21 PM

విశాఖలో హై డ్రామా చోటుచేసుకుంది. ఓ తాగుబోతు మద్యం మత్తులో కత్తితో ఏకంగా పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఎదురుగా గుర్రం సాయి అనే వ్యక్తి తన గుర్రం బండిని నిలిపాడు. రోడ్డుపై వెళ్లేవారికి ఇబ్బందిగా మారడంతో.. బండిని తీసి పక్కన పెట్టాలని సెక్యూరిటీ గార్డ్ కోరాడు. దీంతో రెచ్చిపోయిన సాయి.. సెక్యూరిటీ గార్డుతో పాటూ మరో వ్యక్తిపై కత్తితో  దాడి చేశాడు. దీంతో స్థానికులు త్రీటౌన్ […]

విశాఖలో తాగుబోతు వీరంగం.. కత్తితో పోలీసులపై దాడి!
Follow us on

విశాఖలో హై డ్రామా చోటుచేసుకుంది. ఓ తాగుబోతు మద్యం మత్తులో కత్తితో ఏకంగా పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఎదురుగా గుర్రం సాయి అనే వ్యక్తి తన గుర్రం బండిని నిలిపాడు. రోడ్డుపై వెళ్లేవారికి ఇబ్బందిగా మారడంతో.. బండిని తీసి పక్కన పెట్టాలని సెక్యూరిటీ గార్డ్ కోరాడు. దీంతో రెచ్చిపోయిన సాయి.. సెక్యూరిటీ గార్డుతో పాటూ మరో వ్యక్తిపై కత్తితో  దాడి చేశాడు. దీంతో స్థానికులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సాయిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కత్తితో వారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే సీన్‌లోకి స్థానిక ఎస్సై, సీఐ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపు హైడ్రామా తర్వాత పోలీసులు నిందితుడు సాయిని అరెస్ట్ చేశారు.