ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు

|

May 05, 2019 | 7:11 PM

కృష్ణా జిల్లాలో ఓ ఏసీబీ అధికారిణి తనను భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన పెనమలూరు పరిధిలో చోటుచేసుకుంది. తులసీనగర్‌కు చెందిన  ఏసీబీ అధికారిణి పిడిక్కాల ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రభావతి గత నవంబర్‌లో తమ గ్రామానికే చెందిన శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త… ఆ తర్వాత నుంచి రూ.20 లక్షల కట్నం తేవాలంటూ వేధింపులకు దిగాడు. అవి […]

ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు
Follow us on

కృష్ణా జిల్లాలో ఓ ఏసీబీ అధికారిణి తనను భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన పెనమలూరు పరిధిలో చోటుచేసుకుంది. తులసీనగర్‌కు చెందిన  ఏసీబీ అధికారిణి పిడిక్కాల ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రభావతి గత నవంబర్‌లో తమ గ్రామానికే చెందిన శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త… ఆ తర్వాత నుంచి రూ.20 లక్షల కట్నం తేవాలంటూ వేధింపులకు దిగాడు. అవి కాస్త శ్రుతి మించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రభావతి పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.