పెళ్లి విషయంలో.. తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి!

| Edited By: Srinu

Dec 06, 2019 | 4:04 PM

ప్రేమ.. పెళ్లి.. విషయంలో తల్లీ కూతుళ్ళ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆ కుమార్తె బాత్‌రూమ్‌లో వాడే యాసిడ్‌ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది. ఈ సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఏఎస్‌ఎన్‌ కాలనీ కి చెందిన జ్యోత్స్న వైజాగ్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదివింది. అదే సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించింది. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో.. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ విషయంపై తల్లీ కూతుళ్ళు మధ్య గొడవలు మొదలయ్యాయి. […]

పెళ్లి విషయంలో.. తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి!
Follow us on

ప్రేమ.. పెళ్లి.. విషయంలో తల్లీ కూతుళ్ళ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆ కుమార్తె బాత్‌రూమ్‌లో వాడే యాసిడ్‌ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది. ఈ సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఏఎస్‌ఎన్‌ కాలనీ కి చెందిన జ్యోత్స్న వైజాగ్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదివింది. అదే సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించింది. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో.. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ విషయంపై తల్లీ కూతుళ్ళు మధ్య గొడవలు మొదలయ్యాయి.

ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేస్తామని తల్లి చెప్పినప్పటికీ.. ఆ విషయం బాండ్ పేపర్ పై రాసివ్వాలని కుమార్తె పట్టుబట్టింది. దీనికి తల్లి ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ కుమార్తె బాత్‌రూమ్‌లో వాడే యాసిడ్‌ బాటిల్‌ ను తల్లి ముఖంపై విసిరికొట్టింది. యాసిడ్ ప్రభావంతో ఆ తల్లి ముఖంపై బొబ్బలు వచ్చాయి. బట్టలన్నీ కాలిపోయాయి. తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు వివరించారు.