జీజీహెచ్‌లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి అదృశ్యం

| Edited By:

Jul 28, 2020 | 4:45 PM

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓ వ్యక్తి అదృశ్యం అయ్యారు. తన భర్త జీజీహెచ్‌కి వచ్చిన రోజు నుంచి కనిపించడం లేదంటూ అతడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీజీహెచ్‌లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి అదృశ్యం
Follow us on

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓ వ్యక్తి అదృశ్యం అయ్యారు. తన భర్త జీజీహెచ్‌కి వచ్చిన రోజు నుంచి కనిపించడం లేదంటూ అతడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా సోకిన ఓ వ్యక్తి  ఈ నెల 14న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఈ నెల 16న జీజీహెచ్‌కి తరలించారు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి ఆ వ్యక్తి కనిపించలేదు. 12 రోజులుగా భర్త ఆచూకీ కోసం సదరు వ్యక్తి భార్య ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా, ఎంత మందిని అడిగిన సమాధానం చెప్పే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్‌ అధికారులను అడిగిన ఫలితం లేదని, తన భర్త ఏమైపోయాడో చెప్పండని జీజీహెచ్‌ వద్ద భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read This Story Also: మరణాల రేటును 1.06 శాతంకు పరిమితం చేశాము: జగన్‌