Andhra Pradesh Cm Jagan: 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్పది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 71 సంవత్సరాలు పూర్తిచేసుకుని 72లోకి అడుగు పెడుతున్న శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాట ఎంత విలువైనదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రమైన మనదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు, భావపరమైన, వ్యక్తీకరణ పరమైన, మతపరమైన స్వాతంత్ర్యాలను మన రాజ్యాంగతం ప్రతి ఒక్క భారత పౌరుడికి ప్రసాదించింది. దేశ పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను పెంపొందేలా మన రాజ్యాంగం దిశానిర్దేశం చేసింది. సోదర భావంతో కలిసి ఉండాలని నిర్దేశించింది. ఈ సూత్రాలకు ఆదర్శంగానే ఆంధ్రప్రదేశ్లో గత 20 నెలలుగా పరిపాలన సాగుతోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Also read:
Allu Arjun’s Pushpa Update: కాస్టింగ్ పేమెంట్ల కోసమే రూ.60 కోట్లు అట.. ఎక్కడా తగ్గని పుష్ప మేకర్స్