తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. కేంద్ర నిధులు, పార్లమెంటు సమావేశాలపై చర్చించామన్న విజయసాయిరెడ్డి

|

Jan 25, 2021 | 3:42 PM

ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో..

తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. కేంద్ర నిధులు, పార్లమెంటు సమావేశాలపై చర్చించామన్న విజయసాయిరెడ్డి
Follow us on

వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈనెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఎంపీలతో సీఎం జగన్‌ చర్చించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నివర్ తుపాను నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతామని పేర్కొన్నారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ లోటును పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తాం. విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందన్న వియసాయిరెడ్డి.. ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, గొడ్డేటి మాధవి‌ సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.