యువతులపై చిరుత దాడి..!

| Edited By:

Jun 17, 2019 | 11:03 AM

తిరుమల ఘాట్‌రోడ్‌లో చిరుతపులి హల్‌చల్ చేసింది. రెండో ఘాట్ రోడ్‌లో రెండు వేర్వేరు బైక్‌లపై వస్తున్న స్థానిక యువతులపై చిరుతపులి ఒక్కసారిగా మీదపడి దాడికి తెగబడింది. ఈ దాడిలో 13 ఏళ్ల పావని, 21 ఏళ్ల యామిని గాయపడ్డారు. వెంటనే గాయాలైన ఇద్దరు యువతులను చికిత్స కోసం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత యువతులు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు.. రుయా ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించి, […]

యువతులపై చిరుత దాడి..!
Follow us on

తిరుమల ఘాట్‌రోడ్‌లో చిరుతపులి హల్‌చల్ చేసింది. రెండో ఘాట్ రోడ్‌లో రెండు వేర్వేరు బైక్‌లపై వస్తున్న స్థానిక యువతులపై చిరుతపులి ఒక్కసారిగా మీదపడి దాడికి తెగబడింది. ఈ దాడిలో 13 ఏళ్ల పావని, 21 ఏళ్ల యామిని గాయపడ్డారు. వెంటనే గాయాలైన ఇద్దరు యువతులను చికిత్స కోసం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత యువతులు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు.. రుయా ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అయితే.. తిరుమల ఘాట్‌ రోడ్‌లో చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఘాట్‌రోడ్‌లో ప్రయాణించేవారు భయంతో వణికిపోతున్నారు. ఏక్షణం ఎటువైపు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తోందో అన్న భయం భక్తులను వెంటాడుతోంది.