ఏ పార్టీకైనా సరే.. మేమే శరణ్యం.. బీజేపీ నేత భానుప్రకాశ్

| Edited By:

Jan 15, 2020 | 12:57 PM

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ అధినాయకత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. సడన్‌గా పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అవ్వడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి గురువారం జనసేన- బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. గురువారం జరగబోయే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. స్వాగతిస్తామన్నారు. అదే సమయంలో […]

ఏ పార్టీకైనా సరే.. మేమే శరణ్యం.. బీజేపీ నేత భానుప్రకాశ్
Follow us on

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ అధినాయకత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. సడన్‌గా పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అవ్వడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి గురువారం జనసేన- బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. గురువారం జరగబోయే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. స్వాగతిస్తామన్నారు. అదే సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపార్టీ అయినా సరే.. బీజేపీతోనే కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉందని.. ప్రాంతీయపార్టీలన్నీ బీజేపీవైపే చూస్తున్నాయన్నారు. జనసేన ఒంటరి ప్రయాణం కన్నా.. బీజేపీలో విలీనమే మేలని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.