వైసీపీపై సంచలన కామెంట్స్ చేసిన కన్నా

| Edited By:

Jul 03, 2019 | 9:45 PM

వైసీపీ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. 2014 తర్వాత టీడీపీ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో… ఇప్పుడు వైసీపీ కూడా అలాగే చేస్తోందన్నారు. ప్రజలు మెచ్చి ఒక అవకాశం ఇచ్చారని, దాన్ని వైసీపీ నిలబెట్టుకోవాలన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అయితే కార్యకర్తలు జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. రెండు మూడు గ్రామాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని కన్నా ఆరోపించారు. ప్రేమతో, మంచి పాలనతో ప్రజల […]

వైసీపీపై సంచలన కామెంట్స్ చేసిన కన్నా
Follow us on

వైసీపీ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. 2014 తర్వాత టీడీపీ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో… ఇప్పుడు వైసీపీ కూడా అలాగే చేస్తోందన్నారు. ప్రజలు మెచ్చి ఒక అవకాశం ఇచ్చారని, దాన్ని వైసీపీ నిలబెట్టుకోవాలన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అయితే కార్యకర్తలు జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. రెండు మూడు గ్రామాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని కన్నా ఆరోపించారు. ప్రేమతో, మంచి పాలనతో ప్రజల మనసులను గెలుచుకోవాలి తప్పా.. దాడులు చేసో.. బెదిరించో కాదని సూచించారు.