సంగం డైరీలో భారీ చోరీ..!

| Edited By:

Jul 29, 2019 | 7:54 PM

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డైరీలో భారీ చోరీ జరిగింది. చైర్మన్ ధూళిపాల నరేంద్ర ఉండే గది నుంచి దుండగులు 44 లక్షల రూపాయల నగదు దోచుకుపోయారు. శనివారం, ఆదివారం బ్యాంకు సెలవులు కావడంతో నగదును లాకర్‌లోనే ఉంచారు సంగం డైరీ నిర్వాహకులు. ఆదివారం అర్థరాత్రి ఆగంతకులు ఆ లాకర్‌ను బద్దలు కొట్టి సొత్తు దొచుకుపోయారు. కాగా.. సంగం డైరీ ఆఫీసుకు భారీ భద్రతే ఉంటుంది. చుట్టూ సీసీ కెమెరాలూ ఉన్నాయి. అయినా.. చాకచక్యంగా దొంగతనం జరిగింది […]

సంగం డైరీలో భారీ చోరీ..!
Follow us on

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డైరీలో భారీ చోరీ జరిగింది. చైర్మన్ ధూళిపాల నరేంద్ర ఉండే గది నుంచి దుండగులు 44 లక్షల రూపాయల నగదు దోచుకుపోయారు. శనివారం, ఆదివారం బ్యాంకు సెలవులు కావడంతో నగదును లాకర్‌లోనే ఉంచారు సంగం డైరీ నిర్వాహకులు. ఆదివారం అర్థరాత్రి ఆగంతకులు ఆ లాకర్‌ను బద్దలు కొట్టి సొత్తు దొచుకుపోయారు. కాగా.. సంగం డైరీ ఆఫీసుకు భారీ భద్రతే ఉంటుంది. చుట్టూ సీసీ కెమెరాలూ ఉన్నాయి. అయినా.. చాకచక్యంగా దొంగతనం జరిగింది అంటే.. సంస్థలో పనిచేస్తున్న వాళ్లపనేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు సెక్యూరిటీ మొదలు.. ఆగదిలోకి తరచూ వచ్చి వెళ్లే వ్యక్తులను ఆరా తీస్తున్నారు పోలీసులు.