ఏపీ రాజధాని వివాదం సరికొత్త రూపుదాల్చింది. మూడు రాజధానులు ఉండబోతుందన్న అంశం ఇంకా హాట్టాపిక్గా కొనసాగుతుండగానే.. రాయలసీమ నినాదాలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఈ నినాదాలతో ఏపీ రాజకీయం మరో మలుపుతిరుగుతోంది. రాయలసీమ నినాదాలతో సో కాల్డ్ సీనియర్ లీడర్లంతా బయటికి వస్తున్నారు. లెటర్లు కూడా రాస్తున్నారు. ఇటు సీఎంకు అటు రాష్ట్రపతికి కూడా లేఖలు రాస్తూ.. మరో చర్చకు తెరలేపుతున్నారు. వాటిలో ప్రధానంగా 83 ఏళ్ల నాటి శ్రీబాగ్ ఒప్పందం ఏదైతే ఉందో.. దానిని సైతం బయటికి తీస్తూ.. ఇప్పుడు దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక మరికొందరు మద్రాసు అంటూ తమిళనాడులో కలిపేయాలని.. ఇంకొంతమంది హైదరాబాద్లో కలిపేయాలంటున్నారు. ఇక మరికొందరైతే.. రాజధానంటూ మార్చితే.. కర్నూల్కే మార్చాలని.. వైజాగ్ కాదంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ నినాదాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయా..? నిజంగా పుట్టించారా.. లేదంటే ఈ నినాదాలు.. గతంలో ఉన్నవాటినే కొత్తగా బయటికి తీసుకొచ్చారా.. అన్న దానిపై టీవీ9 వేదికగా ఛానెల్ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజానాథ్, వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తుండగా.. చర్చలోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్, వైసీపీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అదేంటో మీరే చూడండి.