ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు. 50 స్థానాలున్న ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి 41, టీడీపీ 6, జనసేన 1, స్వతంత్రులు 2 స్థానాలు ఉన్నాయి. అయితే తాజా పరిణామాలతో వైసీపీ బలం 22 స్థానాలకు పడిపోయింది. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానన్నారు మేయర్ సుజాత, అధికారంలో ఉన్న పార్టీలో చేరితే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న ఆమె.. బాలినేనితో చెప్పే టీడీపీలో చేరానన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..