Karnool TDP Leader Narayana: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, దాడులు చేసుకోవడం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటోంది. తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ నేత నారాయణ కుటుంబంపై దాడి జరిగింది. చిప్పగిరి-గుంతకల్ మధ్య దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దుండగుల దాడిలో టీడీపీ నేత నారాయణ, అతని భార్య, తమ్ముడికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, నారాయణ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ముఖ్య అనుచరుడు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇలా రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్దాలు, దాడులు చేసుకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అట్టుడుకుతోంది.