కర్నూల్ జిల్లా శ్రీశైలం ఆలయం పీఆర్వో శ్రీనివాస్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వస్తోన్న ఆయనపై కత్తులతో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నిందితులు కర్నూల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.