Jagananna Amma Vodi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నెల్లూరులో పర్యటించనున్నారు. అక్కడ రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు పయణం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. 11.40 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు.