ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. అందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. పేదలకు ఇది వరంగా మారనుంది. మరో మూడేళ్ళలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చేస్తానని ఈ సందర్బంగా జగన్ ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి క్యాన్సర్ పేషంట్లకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు జగన్. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని నేడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభించారు. ఇకపై ఆపరేషన్ తరువాత కోలుకునే వరకు పేషంట్లకు రోజుకు 255 రూపాయలు ఇస్తామన్నారు.