వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ.. నాలుగో రోజుకు చేరిన సమావేశాలు.. సభ ముందుకు పలు కీలక బిల్లులు

|

Dec 03, 2020 | 8:12 AM

ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. గత మూడు రోజులుగా అధికార, విపక్షాల వాగ్వివాదాలతో చలికాలంలోనూ వేడీ పుట్టిస్తున్నాయి.

వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ.. నాలుగో రోజుకు చేరిన సమావేశాలు.. సభ ముందుకు పలు కీలక బిల్లులు
Follow us on

ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. గత మూడు రోజులుగా అధికార, విపక్షాల వాగ్వివాదాలతో చలికాలంలోనూ వేడీ పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీనేతల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో సభ దద్దరిల్లింది. వరుసగా మూడు రోజులపాటు ప్రతిపక్షాల నేతలు సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని పలుమార్లు స్పీకర్‌తో పాటు సీఎం జగన్ సూచించినప్పటికీ టీడీపీ నేతలు గందరగోళాన్ని సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, నాలుగోవ రోజు ఇవాళ అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. అజెండా లో మొత్తం మూడు అంశాలపై స్వల్పకాలిక చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోన నియంత్రణ- అరోగ్య శ్రీ పై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. అలాగే, ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ సంక్షేమం, డిబిటిల పై సభలో స్వల్ప కాలిక చర్చించనున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందులో ల్యాండ్ టైటిలింగ్ బిల్లు తో పాటు దిశ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మున్సిపల్ చట్టం, ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది జగన్ సర్కార్.