IPS Officers Transferred in AP: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొంతమందికి పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ మంగళవారం అర్థరాత్రి తర్వాత జీవో జారీ చేశారు.
బదిలీ అయిన స్థానం..
• విజయనగరం ఎస్పీ రాజకుమారికి దిశ డీఐజీగా పదోన్నతి లభించింది. దీంతోపాటు డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగానూ రాజకుమారికి బాధ్యతలు అప్పగించారు.
• విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు.
• సి.హెచ్.విజయరావు నెల్లూరు ఎస్పీగా బదిలీ అయ్యారు.
• ఎం.రవీంద్రనాథ్ బాబు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
• అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్గా బదిలీ.
• కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ను బదిలీ అయ్యారు.
• వై. రిశాంత్రెడ్డి గుంటూరు రూరల్ అడ్మిన్ అదనపు ఎస్పీగా బదిలీ.
• సతీశ్కుమార్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీ
• విద్యాసాగర్ నాయుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్
• విద్యాసాగర్ నాయుడు ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమకం.
• గరికపాటి బిందు మాధవ్ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు.
• తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు.
• పి జగదీష్ విశాఖపట్నం జిల్లా, పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
• జి కృష్ణకాంత్తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
• విఎన్. మణికంఠ చందోలు విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు.
• కృష్ణకాంత్ పాటిల్ తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు.
• తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: