Andhra Pradesh: సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి బాలినేని.. సొంత పార్టీకి చెందిన నేతలే..!

|

Jun 28, 2022 | 10:11 AM

Andhra Pradesh: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీకి చెందిన నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Andhra Pradesh: సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి బాలినేని.. సొంత పార్టీకి చెందిన నేతలే..!
Minister Balineni Srinivas
Follow us on

Andhra Pradesh: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీకి చెందిన నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తానని, అవసరమైతే సీఎం కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఇటీవల తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి కొంతమంది వైసీపీ నేతలు సహకరిస్తున్నారని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని. తనపై కుట్రలో స్వంత పార్టీ నేతలు కూడా ఉన్నారని తెలుసుకుని సిగ్గుపడుతున్నానన్నారు. గతంలో చెన్నైలో రూ. 5 కోట్లు పట్టుబడినా, ఇటీవల జనసేన మహిళా నేతకు ఫోన్ వచ్చినా, అల్లూరులో కవిత అనే మహిళ కుటుంబ కలహాలను వాడుకుని తనపై బురద చల్లినా, దీని వెనుక టిడిపి నేతలు దామచర్ల జనార్దన్, మంత్రి శ్రీను ఉన్నారన్నారని ఆరోపించారు.

జనసేన మహిళా నేత విషయంలో పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారని, ఆయనపై గౌరవంతో స్పందించామన్నారు. ఇదే విషయంపై తాను పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నానని, మీ మహిళా నేత విషయంలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని తెలిసిందని, దీనిపై విచారణ చేపట్టగలరా అని ప్రశ్నించారు. ‘మీ విచారణలో తన తప్పు ఉందని తేలితే తన పదవికి, పార్టీకి రాజీనా చేస్తా’ అని సవాల్‌ విసిరారు. పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న గౌరవంతోనే ప్రశ్నిస్తున్నానన్నారు. అలాగే రెండు రోజుల క్రితం చెన్నైలో ఒంగోలుకు చెందిన వారి రెండు కోట్లు పట్టుబడినా అది తనకే ఆపాదిస్తూ టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన పై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, కాల్ డేటా తెప్పించుకొని విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి తెలిపారు.