Andhra Pradesh: నేటి నుంచే బీజేపీ అమరావతి సంకల్పయాత్ర.. పాల్గొనున్న జాతీయ, రాష్ట్ర నాయకులు..

|

Jul 29, 2022 | 9:44 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణకై ఏపీ బీజేపీ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.

Andhra Pradesh: నేటి నుంచే బీజేపీ అమరావతి సంకల్పయాత్ర.. పాల్గొనున్న జాతీయ, రాష్ట్ర నాయకులు..
Bjp
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణకై ఏపీ బీజేపీ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ‘మనం.. మన అమరావతి’ నినాదంతో బీజేపీ సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా అమరావతి రాజధాని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులుపై గడప గడపకు ప్రచారం చేయనున్నారు బీజేపీ నాయకులు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో యాత్ర చేపట్టనున్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కాగా, ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొననున్నారు. 4వ తేదీ సాయంత్రం తుళ్ళూరు బహిరంగ సభతో అమరావతి బీజేపీ సంకల్పయాత్ర ముగియనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..