AP Assembly: తీరు మారని ఏపీ అసెంబ్లీ.. నలుగురు టీడీపీ సభ్యులపై సెషన్ వరకు సస్పెన్షన్ వేటు

|

Mar 22, 2022 | 10:56 AM

టీడీపీ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో అసెంబ్లీ మొత్తం సమావేశాల నుంచి నలుగురు తెలుగు దేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

AP Assembly: తీరు మారని ఏపీ అసెంబ్లీ.. నలుగురు టీడీపీ సభ్యులపై సెషన్ వరకు సస్పెన్షన్ వేటు
Thammineni Seetharam
Follow us on

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. టీడీపీ(TDP) సభ్యుల నినాదాలతో సభలో ఆటంకం కలిగింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(Adimulam Suresh) మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం(Thammineni Seetharam). తీరు మార్చుకోవాలని మందలించారు సభాపతి. అయినా వినకపోవడంతో, అనగాని సత్యప్రసాద్‌, బెందాళం అశోక్‌, రామరాజు, రామకృష్ణ బాబును సస్పెండ్‌ చేశారు స్పీకర్. మొత్తం నలుగురు సభ్యులను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే జే బ్రాండ్‌లపై విచారణ, జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పొడియం వద్ద నినాదాలు చేశారు. పలుమార్లు పోడియం వద్దకు రావద్దని స్పీకర్ హెచ్చరించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో అసెంబ్లీ మొత్తం సమావేశాల నుంచి నలుగురు తెలుగు దేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి సస్పెండ్ చేశారు. పొడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటానని సభాపతి చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల వద్ద నుంచి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతూ ‘సభకు సభ్యులుగా ఉన్న మీరు ప్రశ్నోత్తరాలలో పాల్గొంటారని ఎదురు చూశాం.. మీరు సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ సభాపతి నలుగురు టీడీపీ సభ్యులను ఈనెల 25 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.