Andhra Pradesh: విజయవాడ రైల్వేస్టేషన్ లో పట్టపగలే దారుణం.. మూడేళ్ల బాలికను..

|

Jun 11, 2022 | 6:52 PM

Andhra Pradesh: విజయవాడ రైల్వేస్టేషన్ లో మూడేళ్ళ బాలిక కిడ్నప్ కలకలం రేపింది. పట్టపగలు రైల్వేస్టేషన్ తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న..

Andhra Pradesh: విజయవాడ రైల్వేస్టేషన్ లో పట్టపగలే దారుణం.. మూడేళ్ల బాలికను..
Vijayawada Girl Kidnap Case
Follow us on

Andhra Pradesh: విజయవాడ రైల్వేస్టేషన్ లో మూడేళ్ళ బాలిక కిడ్నప్ కలకలం రేపింది. పట్టపగలు రైల్వేస్టేషన్ తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్‌ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో పదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ ఘటన రెండు రోజుల ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉంది. ఆంజనేయలు నగరంలో కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చెత్త కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు. పదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై రెండు రోజుల క్రితం సాయంత్రం ఆరు గంటల సమయంలో నిద్రపోతున్నారు. వారికి పక్కనే ఉన్న షఫీదా మేల్కొని ఉంది. అయితే, ఇద్దరు మహిళలు అక్కడికి వచ్చి చాక్లెట్‌ ఇస్తామని షఫీదాను పిలిచారు. ఆ చాక్లెట్లకు ఆశ పడిన షఫీదా.. వారి వద్దకు వెళ్లింది. వెంటనే వారు ఆ చిన్నారిని తీసుకుని స్టేషన్‌ నుంచి బయటకు వచ్చారు. అయితే, నిద్ర నుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక మహిళ చిన్నారిని తీసుకుని పదో నంబర్‌ ప్లాట్‌ఫాం మెట్లపై నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ మహిళ వెనుక మరో మహిళ వెళ్లడం కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపను చిట్టినగర్‌లోని నెహ్రూ బొమ్మ సెంటర్‌ నుంచి కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బాలిక ఆచూకి కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి.. మరో బాలిక తల్లి ఓడిలోనుచి ఒక్కసారిగా అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..