‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండి అనివార్య కారణాల వల్ల పేర్లు నమోదు చేసుకోనివారు.. జులై 10 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు ఏపి బీసీ కార్పొరేషన్ తెలిపింది. అర్హత ఉన్నవారు గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా అర్జి పెట్టుకోవాలని సూచించింది.
కాగా గత బుధవారం సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద వెనబడిన సామాజిక వర్గాలకు( రజక, నాయీబ్రాహ్మణ, టైలర్(దర్జీ)) రూ.10వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల సమయంలో జగన్ ఈ హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందింది.