మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి ప్రమాణ స్వీకారం

| Edited By:

Aug 26, 2019 | 1:41 PM

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.. వాసిరెడ్డి పద్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, జయరాములు, తానేటి వనితి, చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తదితరులు హాజరయ్యారు. కాగా ఈ నెల 8న వాసిరెడ్డి […]

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి ప్రమాణ స్వీకారం
Follow us on

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.. వాసిరెడ్డి పద్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, జయరాములు, తానేటి వనితి, చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తదితరులు హాజరయ్యారు. కాగా ఈ నెల 8న వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.