ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన హామీలపై చర్చ జరిగింది. వాడీవేడీగా జరిగిన ఈ చర్చలో రగడకు కారణం అయ్యారని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సెస్పెండ్ చేశారు. మార్షల్స్ వాళ్ల ముగ్గుర్ని సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అయితే అకారణంగా ఈ ముగ్గురిపై వేటు వేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్థానంలో కూర్చున్నా ఎలా సస్పెండ్ చేస్తారన్నారు. ముగ్గురిపై వేటు ఎత్తివేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ను కలిసి అభ్యర్థించారు.