బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మకు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామిక వేత్తల సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బిజెపి నేత యామినీ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు వారు పంపిన లేఖను ఆమె తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో (పెద్ద, మధ్యస్థ, చిన్న, ప్రారంభ, ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక, విద్యా సంస్థలు, ఎన్జీఓలు) సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యేక సలహా సేవలను ఈ సిఐఎంఎస్ఎంఈ సంస్థ అందిస్తుంది. అలాగే, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. సిఐఎంఎస్ఎంఈ గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఎంపికైన యామినీ శర్మ తమ సిఐఎంఎస్ఎంఈ ద్వారా భారత్ లో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు.