ఏపీ అసెంబ్లీలో 11 బిల్లులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ సాగుతుంటే.. మరోవైపు రాయలసీమ విద్యార్థి సంఘాలు ఏపీ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలంటూ ఆందోళన బాట పట్టాయి. అమరావతిలో అసెంబ్లీ వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి.
అంతేకాకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీ ప్రకటన చేయాలంటూ ఆందోళనకారులు గేట్ వరకు దూసుకురావడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీనితో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.