నీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు-పవన్ కళ్యాణ్

|

Jun 16, 2020 | 10:42 PM

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి […]

నీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు-పవన్ కళ్యాణ్
Follow us on

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ వేడుకున్నారు.