అమరావతి ‘సమరం’.. విపక్షనేతల హౌస్ అరెస్ట్

| Edited By:

Jan 07, 2020 | 11:20 AM

ఏపీలో రాజధాని తరలింపు వివాదం కొనసాగుతోంది. రాజధాని తరలింపు ఆపాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి వివిధ పార్టీ నాయకుల మద్ధతు కూడా లభిస్తోంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్భంధం చేస్తున్నారు. గుంటూరులో పొలిటికల్ జేఏసీ నేతలను ముందుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. […]

అమరావతి సమరం.. విపక్షనేతల హౌస్ అరెస్ట్
Follow us on

ఏపీలో రాజధాని తరలింపు వివాదం కొనసాగుతోంది. రాజధాని తరలింపు ఆపాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి వివిధ పార్టీ నాయకుల మద్ధతు కూడా లభిస్తోంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్భంధం చేస్తున్నారు. గుంటూరులో పొలిటికల్ జేఏసీ నేతలను ముందుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, అనుమోరు ప్రభాకర్ రావుతో పాటు బోరబోయిన శ్రీనివాస్, ఉప్పాల నాగేశ్వరరావు, జంగ్యాల అజయ్‌లను తెల్లవారుజామునుంచే పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కేశినేని నాని, దేవినేని ఉమ, బోండా ఉమ, బోడె ప్రసాద్ తదితరులను గృహనిర్భంధం చేశారు. అయితే తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు పోలీసులను ప్రశ్నించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే ముందస్తు అరెస్ట్‌లు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపుతో సీఎం జగన్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయలేరని అన్నారు.