ఏపీ రాజధానుల అంశం మరింత హీటెక్కింది. సీఎం జగన్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస పాలనలో రైతులు బలైపోతున్నారన్నారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని.. నాగఫణీంద్ర అనే ఓ యువకుడిని అరెస్ట్ చేయడంతో.. ఆయన తాతా రైతు గోపాలరావ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని తరలించడానికి వీలు లేదంటూ.. శాంతియుత పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు లోకేష్. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
.@ysjagan గారి రాక్షస పాలనలో రైతులు బలైపోతున్నారు. మనవడు నాగ ఫణీంద్రని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చెయ్యడంతో ఈరోజు మరో రైతు గోపాల్ రావుగారు ఆందోళనతో మృతి చెందడం బాధాకరం.(1/2)
— Lokesh Nara (@naralokesh) January 6, 2020
రాజధానిని తరలించడానికి వీలు లేదని రైతులు శాంతియుతంగా పోరాడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి రైతులను అరెస్ట్ చెయ్యడం దారుణం. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చెయ్యాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 6, 2020