జగన్‌ది రాక్షస పాలన.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ లోకేష్

| Edited By:

Jan 07, 2020 | 4:58 AM

ఏపీ రాజధానుల అంశం మరింత హీటెక్కింది. సీఎం జగన్‌ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస పాలనలో రైతులు బలైపోతున్నారన్నారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని.. నాగఫణీంద్ర అనే ఓ యువకుడిని అరెస్ట్ చేయడంతో.. ఆయన తాతా రైతు గోపాలరావ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని తరలించడానికి వీలు లేదంటూ.. శాంతియుత పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు […]

జగన్‌ది రాక్షస పాలన.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ లోకేష్
Follow us on

ఏపీ రాజధానుల అంశం మరింత హీటెక్కింది. సీఎం జగన్‌ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస పాలనలో రైతులు బలైపోతున్నారన్నారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని.. నాగఫణీంద్ర అనే ఓ యువకుడిని అరెస్ట్ చేయడంతో.. ఆయన తాతా రైతు గోపాలరావ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని తరలించడానికి వీలు లేదంటూ.. శాంతియుత పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు లోకేష్. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.