టీడీపీ సీనియర్ నేత, కర్నూల్ మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఉరేసుకొని ఆయన ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో పదవులు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. మరోవైపు ఆర్థిక సమస్యల కారణం వలనే బంగీ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని బంగీ కుమారుడు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బంగీ ఇప్పుడు పార్టీలో లేరని, టీడీపీకి.. ఆయనకు సంబంధం లేదని ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు స్పష్టం చేశారు