నీలం సాహ్ని పదవీ కాలన్ని పెంచండి.. కేంద్రానికి జగన్ లేఖ

| Edited By:

Jul 30, 2020 | 10:58 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఓ లేఖను రాశారు.

నీలం సాహ్ని పదవీ కాలన్ని పెంచండి.. కేంద్రానికి జగన్ లేఖ
Follow us on

AP CS Nilam Sawhney: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన బుధవారం ఓ లేఖను రాశారు. అయితే గతేడాది నవంబర్‌లో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. జూన్ 30న రిటైరయ్యారు. ఇక అప్పటి పరిస్థితుల దృష్ట్యా నీలం సాహ్ని సేవలు తమకు చాలా అవసరమని, ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని జగన్ సర్కార్,‌ కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం మూడు నెలలు మాత్రమే పొడిగించగా.. సెప్టెంబర్‌తో ఆమె పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి ఆమె పదవీకాలాన్ని పొడిగించమని జగన్ కేంద్రాన్ని కోరారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతిని ఇస్తే డిసెంబర్ వరకు నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా కొనసాగే అవకాశం ఉంది.

కాగా 1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ సేవలను అందించారు. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా, నల్గొండ జాయింట్ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు. ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ పీడీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1811 కొత్త కేసులు.. 13 మరణాలు