వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత

| Edited By:

Mar 11, 2019 | 7:27 AM

టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్న క్రమంలో పార్టీ కీలక నేత ఘంటా మురళి వైసీపీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనకు మద్దతుగా పశ్చిమ గోదావరికి చెందిన మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా పేరొందిన మురళి, విభజనానంతరం వైసీపీలో చేరారు. ఆ పార్టీలో ముఖ్య నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని […]

వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత
Follow us on

టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్న క్రమంలో పార్టీ కీలక నేత ఘంటా మురళి వైసీపీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనకు మద్దతుగా పశ్చిమ గోదావరికి చెందిన మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

ఒకప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా పేరొందిన మురళి, విభజనానంతరం వైసీపీలో చేరారు. ఆ పార్టీలో ముఖ్య నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వైసీపీకి రాజీనామా చేశారు. మురళి రాజీనామాతో వైసీపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ నిపుణలుు చెబుతున్నారు.