వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ.. 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్.. పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. అమ్మఒడి పథకం అమలు, ఉద్యోగాల భర్తీ.. పరవాడ కాలుష్యంపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును.. మంత్రి నారాయణస్వామి సభలో ప్రవేశపెట్టనున్నారు.